Share News

మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలి

ABN , Publish Date - Jul 16 , 2024 | 12:05 AM

రామభద్రపురం మండలంలో ఓ చిన్నారిపై అత్యాచారం చేయిబోయిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి డిమాండ్‌ చేశారు.

 మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలి

గజపతినగరం: రామభద్రపురం మండలంలో ఓ చిన్నారిపై అత్యాచారం చేయిబోయిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం పురిటిపెంట గ్రామంలో ఐద్వా ఆధ్వ ర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు నెలల పసికందుపై అత్యాచారం చేయడం సిగ్గుచేటన్నారు. గంజాయి మత్తులో ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణవేణి, కె.సుందరి రాములమ్మ, ఎల్లారపు అచ్చయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2024 | 12:06 AM