వ్యాను బోల్తా.. ఒకరి మృతి
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:55 PM
మరడాం, కోమటిపల్లి మధ్యలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం బొలేరో వ్యాను అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు.
దత్తిరాజేరు: మరడాం, కోమటిపల్లి మధ్యలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం బొలేరో వ్యాను అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. బూర్జవలస ఎస్ఐ లక్ష్మీప్రసన్నకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. రామభద్రపురం నుంచి విశాఖ వెళ్తున్న బొలేరో వ్యాను మరడాం, కోమటిపల్లి మధ్యలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారిని గజపతినగరం పీహెచ్సీకి తరలించారు. వారిలో లోగడ పైడినాయు డు (35) మృతిచెందగా, వేరొక వ్యక్తి కాటం శివకుమార్ చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరూ విశాఖపట్టణం జిల్లా మారికవలసకు చెందినవారు. బంధువులకు సమా చారం అందించినట్టు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.