సకాలంలో వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:01 AM
మున్సిపల్ కార్మికుల వేతనాలను సకా లంలో అందించాలని సీఐ టీయూ నాయకుడు దావాల రమణారావు, మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు సీహెచ్ సురేష్, సంజీవి, పడాల వేణు డిమాండ్ చేశారు.
పాలకొండ: మున్సిపల్ కార్మికుల వేతనాలను సకా లంలో అందించాలని సీఐ టీయూ నాయకుడు దావాల రమణారావు, మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు సీహెచ్ సురేష్, సంజీవి, పడాల వేణు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నగర పంచా యతీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం కమిషనర్ సర్వేశ్వ రరావుకు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. జనవరి 2024 ఖర్చులకు వెయ్యి రూపాయలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తే ఇంతవర కు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ ఏడాది మార్చి నెలకు రూ.21వేలు వేతనం చెల్లించకుండా పాత వేతనమే చెల్లించడం తగదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు.