Share News

అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:47 PM

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరువీరుల కుటుంబాలకు అండగా ఉంటామని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే తదితరులు

బెలగాం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి) : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరువీరుల కుటుంబాలకు అండగా ఉంటామని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జాతీయ పోలీసు అమర వీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. వారి త్యాగాలు మరువలేమన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించి యోగక్షేమాలు అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ దిలీప్‌కిరణ్‌, పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:47 PM