వదలవు.. కదలవు!
ABN , Publish Date - Jan 05 , 2024 | 12:09 AM
కొమరాడ మండలం కుమ్మరిగుంట రహదారిపై గురువారం ఏడు గజరాజులు హల్చల్ చేశాయి. దీంతో ఆ దారిలో ప్రయాణించే వారు, ప్రజలు, వాహనదారులు బెంబేలెత్తిపోయారు.
కొమరాడ/భామిని, జనవరి 4 : కొమరాడ మండలం కుమ్మరిగుంట రహదారిపై గురువారం ఏడు గజరాజులు హల్చల్ చేశాయి. దీంతో ఆ దారిలో ప్రయాణించే వారు, ప్రజలు, వాహనదారులు బెంబేలెత్తిపోయారు. అవి ఎవరిపై దాడి చేస్తాయోనని ఆందోళన చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడకు వచ్చి సమీప ప్రాంతంలో ఉన్న పంట పొలాల్లోకి ఏనుగుల గుంపును తరలించారు. దీంతో ఆ రహదారి గుండా ప్రయాణాలు యథావిధిగా సాగాయి. ఇక భామినిలో సంచరిస్తున్న ఏనుగులు నల్లరాయిగూడ సమీపానికి చేరుకొని చెరకు తోటల్లో తిష్ఠవేశాయి. సాయంత్రం ఆరుబయట సంచరించాయి. ఏనుగుల వల్ల పంటలను నష్టపోయామని, తమను ఆదుకోవాలని సొలికిరి గ్రామానికి చెందిన రైతులు కోరుతున్నారు.