నెల గడవకుండానే..
ABN , Publish Date - Feb 27 , 2024 | 11:52 PM
విధుల్లో చేరి నెలరోజులు కాకుండానే పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ బదిలీ కావడం చర్చనీయాంశమవుతోంది.
పార్వతీపురం టౌన్, ఫిబ్రవరి 27 : విధుల్లో చేరి నెలరోజులు కాకుండానే పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ బదిలీ కావడం చర్చనీయాంశమవుతోంది. పాలకవర్గంతో విభేదాలా?.. లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అన్న దానిపై సర్వత్రా పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా గాజువాక నుంచి బదిలీపై వచ్చిన పి.సింహాచలం ఈ నెల రెండో తేదీన పార్వతీపురం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇంతలోనే ఆయన్ని ఇక్కడ నుంచి చీరాలకు స్థానచలనం కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిడదవోలు నుంచి కె.శ్రీనివాసరావును పార్వతీపురం మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏదేమైనా ఇంత హుటాహుటిన సింహాచలంను బదిలీ చేయడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.