29న చంద్రబాబు ‘రా కదలిరా’ సభ
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:05 AM
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 29న ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు రానున్నారు.
భీమడోలు, జనవరి 11 : తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 29న ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు రానున్నారు. ‘రా కదలిరా’ బహిరంగ సభకు హాజరుకానున్నారు. గురువారం సభా ప్రాంగణాన్ని ఏలూరు టీడీపీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పరిశీలించారు. సభ నిర్వహణ కోసం భీమడోలు హైస్కూలు ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాన్ని, హెలీప్యాడ్ కోసం శ్రీ వేంకటేశ్వర జూని యర్ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. గన్నితో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్, స్థానిక టీడీపీ నాయకులు పరిశీలించారు. అంతకు ముందు భీమడోలు క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో గన్ని సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో అన్యాయాలను,అక్రమాలను ఎత్తి చూపేందుకు రా..కదలిరా నిర్వహిస్తున్నారన్నారు.