29 వరకు చేబ్రోలు రైల్వే గేటు మూసివేత
ABN , Publish Date - May 26 , 2024 | 12:39 AM
మండలంలోని చేబ్రోలు రైల్వే గేటును (365) కి.మీ. 522 1–3 వద్ద అత్యవసర మరమ్మతుల నిమిత్తం శనివారం మూసివేశారు.
ఉంగుటూరు, మే 25 : మండలంలోని చేబ్రోలు రైల్వే గేటును (365) కి.మీ. 522 1–3 వద్ద అత్యవసర మరమ్మతుల నిమిత్తం శనివారం మూసివేశారు. దీంతో భీమవరం– జంగారెడ్డిగూడెం వెళ్లే బస్సులు కైకరం మీదుగా మళ్ళిస్తున్నారు. ఈనెల 29వ తేదీ సాయంత్రం వరకు మరమ్మతుల నిమిత్తం గేటును మూసివేయనున్నట్టు తాడేపల్లిగూడెం డివిజన్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఒక ప్రకటనలో కోరారు.