నామినేషన్కు వేలాదిగా తరలివచ్చిన ప్రజలే విజయానికి సంకేతం
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:25 AM
ఏలూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి నామినేషన్ కార్యక్రమంలో కదం తొక్కి నైతికంగా మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞత లు తెలిపారు.
ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి చంటి
ఏలూరుటూటౌన్, ఏప్రిల్ 24: ఏలూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి నామినేషన్ కార్యక్రమంలో కదం తొక్కి నైతికంగా మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞత లు తెలిపారు. బడేటి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ వేలాదిగా నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రజలే తన విజయానికి సంకేతమన్నారు. వైసీపీ ప్రభుత్వం పై ఉన్నత వ్యతిరేకత నిన్నటి కార్యక్రమంతో అర్థమైందన్నారు. రాష్ర్టాభివృద్ధిని కాంక్షిస్తున్న ప్రతీ ఒక్కరు కూటమికి జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మండుటెండలు సైతం లెక్కచేయకుండా అన్ని వర్గాల ప్రజలు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొనటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో కూటమి విజయం తప్పదని ప్రజలు స్పష్టం చేశారని అన్నారు. కార్యక్రమంలో పెద్దిబోయిన శివప్రసాద్, చోడే వెంకటరత్నం, బౌరోతు బాలాజీ, గూడవల్లి వాసు, ఆర్ఎన్ఆర్, అమరావతి అశోక్, మల్లెపు రాము, రెడ్డి నాగరాజు, పాల్గొన్నారు.