యువతి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Mar 18 , 2024 | 12:17 AM
నూజివీడు మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ఒరిస్సా రాష్ర్టానికి చెందిన యువతి మనీషా నాయక్ (16) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
నూజివీడు టౌన్, మార్చి 17: నూజివీడు మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ఒరిస్సా రాష్ర్టానికి చెందిన యువతి మనీషా నాయక్ (16) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఓ ప్రైవేట్ కంపెనీలో షిఫ్ట్ డ్యూటీకి వెళ్లిన మనీషా తల్లిదండ్రులు ఆదివారం తిరిగి వచ్చి చూసేసరికి తమ కుమార్తె ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని కనిపించడంతో సమాచారాన్ని నూజివీడు రూరల్ పోలీసులకు అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.