Share News

75 మంది వలంటీర్లకు నోటీసులు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:48 AM

కలిదిండిలో ఈ నెల 20న నిర్వహించిన వైసీపీ నేతల సమావేశంలో పాల్గొన్న 75 మంది వలంటీర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో దినతేజ్‌ తెలిపారు.

75 మంది వలంటీర్లకు నోటీసులు

కలిదిండి, ఏప్రిల్‌ 24 : కలిదిండిలో ఈ నెల 20న నిర్వహించిన వైసీపీ నేతల సమావేశంలో పాల్గొన్న 75 మంది వలంటీర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో దినతేజ్‌ తెలిపారు. వీఎస్‌టీ టీం వీడియో ఆధారంగా రాజీనామా చేసిన వారితోపాటు విధుల్లో ఉన్న వలంటీర్లను గుర్తించినట్లు చెప్పారు. నోటీసులకు సమాచారం ఇవ్వటానికి 48 గంటల గడువు ఇచ్చినట్టు తెలిపారు. ఎన్నికల అధికారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:48 AM