Share News

నూజివీడు.. పసుపుమయం

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:52 AM

నూజివీడు కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి బుధవారం పట్టణంలో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు.

నూజివీడు.. పసుపుమయం
నామినేషన్‌ వేసేందుకు పాదయాత్రగా వెళుతున్న పార్థసారథి

పాల్గొన్న ఏలూరు ఎంపీ అభ్యర్థి మహేష్‌ కుమార్‌ యాదవ్‌

నూజివీడు, ఏప్రిల్‌ 24: నూజివీడు కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి బుధవారం పట్టణంలో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. నియో జకవర్గంలో ప్రతి గ్రామం నుంచి తెలుగు తమ్ముళ్ళు నామినేషన్‌ కార్యక్రమానికి పోటెత్తారు. దీంతో నూజివీడు పురవీధులు పసుపుమయంగా మారాయి. సారథి ఉదయం శ్రీశైలం నుంచి వచ్చిన పురోహితుల నుంచి వేదాశీర్వాదం తీసుకుని, కుటుంబ సభ్యులతో కలసి బస్టాండ్‌ సమీపంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నామినేషన్‌ కార్యక్రమానికి పాద యాత్రగా బయల్దేరారు. నూజివీడు చిన్నగాంధీబొమ్మ, పెద్దగాంధీ బొమ్మ సెంటర్లలో గాంధీ విగ్రహాలకు నివాళులర్పించి పట్టణ పురవీధుల్లో పాద యాత్రగా వెళ్ళడంతో దాదాపు నామినేషన్‌ ర్యాలీ కార్యక్రమం గంటకు పైగా సాగింది. ఏలూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌ సారథి తో కలిసి కొంతసేపు ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు. నామినేషన్‌ వేసేందుకు నూజివీడు పార్టీ కార్యాలయం నుంచి పార్థసారథి పాదయాత్రగా తరలివెళ్ళారు. నూజివీడు నియోజకవర్గ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాల యం వరకు దాదాపు మూడు కిలోమీటర్లు మేర ఈ పాదయాత్ర సాగింది. మరోవైపు నూజివీడు మండలం నుంచి కార్యకర్తలు, హనుమాన్‌ జంక్షన్‌ రహదారి వైపు, ముసునూరు మండలం నుంచి కార్యకర్తలు నూజివీడు బైపాస్‌, తిరువూరు రోడ్డువైపు, ఆగిరిపల్లి మం డలం నుంచి విజయవాడ రహదారివైపు తరలిరావడంతో ప్రధాన రహదారులన్నీ పూర్తిగా కిటకిటలాడాయి.

Updated Date - Apr 25 , 2024 | 12:52 AM