తెరుచుకోని సచివాలయం తలుపులు
ABN , Publish Date - Jan 21 , 2024 | 12:09 AM
మీర్జాపురం సచివాలయం తలుపులు శనివారం ఉదయం 11.30 దాటినా తెరుచుకోలేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం సచి వాలయానికి వచ్చిన గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది.
తాళం పోగొట్టిన సిబ్బంది..
మఽధ్యాహ్నం వరకు తెరుచుకోని మీర్జాపురం సచివాలయం తలుపులు
నూజివీడు టౌన్, జనవరి 20: మీర్జాపురం సచివాలయం తలుపులు శనివారం ఉదయం 11.30 దాటినా తెరుచుకోలేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం సచి వాలయానికి వచ్చిన గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. సమయపాలన పాటించాల్సిన సచివాలయ సిబ్బంది బాధ్యతారాహిత్యంతో తమ వద్ద ఉన్న సచివాలయం తాళాలను పారవేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది సైతం ఆరుబయటే కాలక్షేపం చేశారు. సచివాలయం తాళాలు తెరుచుకోని విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు మఽధ్యాహ్నం ఒంటిగంటకు సచివాలయ తాళాలు తెరుచుకున్నాయి.