టీడీపీతోనే కార్మికుల కష్టాలు తీరతాయి
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:23 AM
‘ఇప్పటికే భవన నిర్మాణం ఈ ఐదేళ్లలో నాశనమైంది. ఈ రంగాన్ని నమ్ముకున్న కార్మికులు అష్ఠకష్టాలు పడ్డారు. చేతినిండా పనిలేక కొందరు, ఇంకొందరు నరకయాతన చవిచూశారు.
చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగా రోషన్కుమార్
బుట్టాయగూడెం, ఏప్రిల్ 24:‘ఇప్పటికే భవన నిర్మాణం ఈ ఐదేళ్లలో నాశనమైంది. ఈ రంగాన్ని నమ్ముకున్న కార్మికులు అష్ఠకష్టాలు పడ్డారు. చేతినిండా పనిలేక కొందరు, ఇంకొందరు నరకయాతన చవిచూశారు. పెరిగిన సిమెంట్ ధరలు, ఇసుక కొరత వంటి సమస్యలు వెన్నాడగా వేల కుటుంబాలు పనులు లేక విలవిల్లాడాయి. ఈ కష్టాలు అన్ని తొలగాలంటే తెలుగుదేశం గెలుపొందాల్సిందే.’ అని చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి సొంగా రోషన్కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలో ఆయన బుధవారం భవననిర్మాణ కార్మికులు, సీనియర్ సిటిజన్స్, రజక సంఘం ప్రతినిధులు, కార్పెంటర్లు, ఆటో యూనియన్ సభ్యులతో ముకాముఖి భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టాల్లో ఉన్న కర్షకులు, కార్మికులకు అండగా నిలిచేది తెలుగుదేశమేనని రోషన్ సమాధాన పరిచారు. చింతలపూడి నుంచి తనకు లోక్సభ స్థానం నుంచి పుట్టా మహేష్కుమార్ యాదవ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి నేతలు ఆకుమర్తి రామారావు, రావూరి కృష్ణ, పరిమి సత్యనారాయణ, పెనుమర్తి రామ్కుమార్, రాజ్పాల్ కుమార్, నంబూరి రామచంద్రరాజు, సత్యనారాయణ, శ్రీదేవి, అంబేద్కర్, రాము, దుర్గారావు, తాతాజీ, రామలింగేశ్వరరావు, అనిల్, ప్రసాద్ పాల్గొన్నారు.