Share News

YS Jagan: వినుకొండలో వైఎస్ జగన్.. 144 సెక్షన్ ఉన్నా..!

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:37 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండకు చేరుకున్నారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు...

YS Jagan: వినుకొండలో వైఎస్ జగన్.. 144 సెక్షన్ ఉన్నా..!

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండకు చేరుకున్నారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ఈ క్రమంలో వినుకొండలో భారీగా పోలీసు బలగాల మోహరించాయి. అయితే.. 144 సెక్షన్ ఉన్నా సరే అత్యుత్సాహం ప్రదర్శించిన ఆయన ర్యాలీ నిర్వహించారు. దీంతో శివయ్య స్తూపం వద్ద కార్యకర్తలు, నేతలను పోలీసులు ఆపేశారు.


YS-Jagan-Convoy-2.jpg

భారీ బందోబస్తు!

మరోవైపు.. రషీద్ ఇంటికి వెళ్లే మార్గం చిన్న సందు కావటంతో జనాన్ని ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేసే పనిలో ఉన్నారు. కాగా.. వైఎస్ జగన్‌తో పాటు వైసీపీ నేతల వాహనాలకు మాత్రమే రషీద్ ఇంటి వరకూ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పరామర్శ అనంతరం వైఎస్ జగన్ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతారని తెలిసింది.

Updated Date - Jul 19 , 2024 | 05:42 PM