Share News

Anant Ambani-Radhika Merchant Wedding Reception: పూర్తైన అనంత్-రాధిక పెళ్లి వేడుకలు.. లాస్ట్ రోజు ప్రముఖుల హాజరు

ABN , Publish Date - Jul 15 , 2024 | 08:18 AM

ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani) పెళ్లి వేడుకలు(wedding celebrations) మంగళ ఉత్సవ్‌( Mangala Utsav) కార్యక్రమంతో నిన్న (జులై 14న) ముగిశాయి. ముంబైలోని(mumbai) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖులతోపాటు పలువురు హాజరయ్యారు.

Anant Ambani-Radhika Merchant Wedding Reception: పూర్తైన అనంత్-రాధిక పెళ్లి వేడుకలు.. లాస్ట్ రోజు ప్రముఖుల హాజరు
Anant Ambani-Radhika Merchant Wedding Reception

ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani) పెళ్లి వేడుకలు(wedding celebrations) మంగళ ఉత్సవ్‌( Mangala Utsav) కార్యక్రమంతో నిన్న (జులై 14న) ముగిశాయి. ముంబైలోని(mumbai) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖులతోపాటు పలువురు హాజరయ్యారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జూలై 12న అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ పెళ్లిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బట్టల నుంచి విందు వరకు ప్రతిదీ చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. పెళ్లి జరిగిన మరుసటి రోజే 'శుభ్ ఆశీర్వాద్' వేడుక జరిగింది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు పెళ్లి రెండో రోజు జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా వచ్చారు. నిన్న మూడో రోజు అంబానీ కుటుంబం 'మంగళ ఉత్సవ్' కార్యక్రమంతో వేడుకలు పూర్తయ్యాయి.


రవీంద్ర జడేజా, రివాబా జడేజా, బాబీ డియోల్‌తో సహా పలువురు అతిథులు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ రిసెప్షన్‌లో పాల్గొన్నారు.


అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ రిసెప్షన్‌కు దివ్య ఖోస్లా కుమార్ కూడా హాజరయ్యారు.


బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు, తన భార్య పాత్రలేఖతో కలిసి 'మంగళ ఉత్సవ్' వేడుకలో పాల్గొన్నారు. పత్రలేఖ నీలం రంగు చీరలో చాలా అందంగా కనిపించారు. ఇక రాజ్‌కుమార్‌రావు బ్లాక్ కలర్ డ్రెస్ ధరించారు.


జాకీ ష్రాఫ్ తన కొడుకు టైగర్‌తో కలిసి అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ 'మంగల్ ఉత్సవ్' కార్యక్రమానికి హాజరయ్యారు. నటుడు టైగర్ ష్రాఫ్ నలుపు రంగు దుస్తుల్లో కనిపించగా, జాకీ ష్రాఫ్ తెల్లటి దుస్తుల్లో ఉన్నారు.


భోజ్‌పురి స్టార్ ఖేసరీ లాల్ యాదవ్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ 'మంగళ ఉత్సవ్' వద్దకు వచ్చారు. ఖేసరీ తెలుపు రంగు కుర్తా పైజామాలో కనిపించారు.

ఈ క్రమంలో చివరిరోజైన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహ వేడుక 'మంగళ ఉత్సవ్' కూడా చాలా గ్రాండ్‌గా జరిగింది. బాలీవుడ్ నుంచి భోజ్‌పురి పరిశ్రమ వరకు అనేక మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

Investment Plan: నెలకు రూ.16 వేలు కడితే కోటీశ్వరులవ్వొచ్చు.. ఎలాగంటే..?


Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!


For Latest News and Business News click here

Updated Date - Jul 15 , 2024 | 08:20 AM