Share News

iPhone : భారత్‌లో తగ్గిన ఐఫోన్‌ ధరలు

ABN , Publish Date - Jul 27 , 2024 | 06:38 AM

భారత్‌లో తన ఐఫోన్ల ధరలు 3 నుంచి 4 శాతం (రూ.300 నుంచి రూ.6,000) తగ్గిస్తున్నట్టు యాపిల్‌ కంపెనీ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్‌లో మొబైల్‌ ఫోన్లపై కస్టమ్స్‌ డ్యూటీ ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించటమే ఇందుకు

iPhone : భారత్‌లో తగ్గిన ఐఫోన్‌ ధరలు
iPhone Price Down

న్యూఢిల్లీ: భారత్‌లో తన ఐఫోన్ల ధరలు 3 నుంచి 4 శాతం (రూ.300 నుంచి రూ.6,000) తగ్గిస్తున్నట్టు యాపిల్‌ కంపెనీ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్‌లో మొబైల్‌ ఫోన్లపై కస్టమ్స్‌ డ్యూటీ ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించటమే ఇందుకు కారణం. ఈ నిర్ణయంతో భారత్‌లో తయారయ్యే ఐఫోన్‌ 13, 14, 15 మోడల్స్‌ ధర రూ.300 తగ్గింది. ఎంట్రీ లెవల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ ధరా రూ.49,900 నుంచి రూ.47,600కు చేరింది. దిగుమతి చేసుకునే తన లేటెస్ట్‌ మోడల్‌ ఐఫోన్‌ 15 ప్రో మోడల్‌ ధరా రూ.5,100 నుంచి రూ.6,000 వరకు తగ్గింది.


భారత్‌లో ఐఫోన్‌ 16 తయారీ!

యాపిల్‌ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబరులో తన లేటెస్ట్‌ ఐఫోన్‌ 16 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ ఫోన్లను భారత్‌లో అసెంబ్లింగ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.


Also Read:

SEBI : బ్యాచిలర్స్‌కు అచ్చిరాని మార్కెట్‌

వాయిస్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌లకు విడివిడిగా రీచార్జ్‌ ప్లాన్స్‌ !

RBI : అర్బన్‌ సహకార బ్యాంకులపై ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యలు

For More Business News and Telugu News..

Updated Date - Jul 27 , 2024 | 09:03 AM