Chennai: ఆస్తి తగాదా.. తండ్రిని చంపిన కుమారుడు
ABN , Publish Date - Mar 21 , 2024 | 11:43 AM
స్థానిక కొళత్తూర్ రాజమంగళంలో ఆస్తి తగాదాలో ఓ కుమారుడు తండ్రిని దారుణంగా హతమార్చాడు.
చెన్నై: స్థానిక కొళత్తూర్ రాజమంగళంలో ఆస్తి తగాదాలో ఓ కుమారుడు తండ్రిని దారుణంగా హతమార్చాడు. పోలీసుల కథనం మేరకు... రాజమంగళం బాబానగర్కు చెందిన మధుసూదనన్(64), శారద దంపతుల నాల్గో కుమారుడు జార్జిబుష్ తనతండ్రి పేరుతో ఉన్న ఆస్తులను తన పేరున రాసివ్వాలని గొడవపడే వాడు. మంగళవారం సాయంత్రం పూటుగా తాగి వచ్చిన జార్జిబుష్... మత్తులో ఇనుప రాడ్తో తం డ్రిపై దాడికి పాల్పడడంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. దీనిపై అందిన సమాచారంతో పోలీసులు మధుసూధనన్ మృతదేహాన్ని స్టాన్లీఆసుపత్రికి తరలించారు. జార్జిబుష్ ను అరెస్ట్ చేసి బుధవారం ఉదయం కోర్టులో హాజరుపరచిన అనంతరం రిమాండ్కు తరలించారు.