Home » Tamil Nadu
మదురైలో శనివారం కురిసిన అకాల వర్షం వాతావరణాన్ని చల్లబరిచినప్పటికీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీర ప్రాంతంలో వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి.
భార్య వివాహేతర సంబంధాన్ని జీర్ణించుకోలేని భర్త తన ఇద్దరు పిల్లలను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న విషాదక ఘటన శనివారం నగరంలో చోటుచేసుకుంది. వెస్ట్ మాంబాళం కృష్ణప్ప నాయకర్ వీధికి చెందిన మోహన్ (55) పాత ఇనుప వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు భార్య యమున, సాయి స్వాతి (13), తేజర్ (5) అనే ఇద్దరు పిల్లలున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు (AP Elections) మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈసారి ఓటు వేయాల్సిందేనని తెలుగోడు గట్టిగా ఫిక్సయ్యాడు!. అందుకే దేశ విదేశాల్లో ఉన్న పలువురు ఓటర్లు ఇండియాకు విచ్చేయగా.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు కూడా వచ్చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు (Telugu People) ఓటింగ్పై ఆసక్తిగా ఉన్నారు...
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (AP Elections 2024) మరో మూడు రోజుల్లో జరుగనున్నాయి. రేపటితో ప్రచారానికి కూడా తెరపడనుంది. ఈనెల 13న రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఓటింగ్పై ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏపీకి ప్రయాణాలు మొదలయ్యాయి కూడా.
కష్టానష్టాల్లో తోడునీడగా నిలిచిన భార్య హఠాత్తుగా మృతి చెందటంతో చలించిపోయిన భర్త, ఆమె జ్ఞాపకాలను పదిలపరచుకునేలా గుడికట్టి కుంభాభిషేకం జరిపి ఆరాధిస్తున్నాడు.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ విస్ఫోటం సంభవించింది. హఠాత్తుగా సంభవించిన పేలుడు కారణంగా ఐదుగురు మహిళలు సహా 8మంది దుర్మరణం చెందారు.
తమిళనాడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే సి.వేలాయుధం బుధవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. తమిళనాడు అసెంబ్లీకి 1996లో బీజేపీ టిక్కెట్పై గెలిచిన తొలి ఎమ్మెల్యే కూడా ఆయనే కావడం విశేషం.వేలాయుధం మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ట్వీట్లో సంతాపం తెలిపారు.
సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ‘మీ బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు హవాలా డబ్బు వెళ్లింది’ అని బెదిరించి నగరవాసి నుంచి రూ. 91.64 లక్షలు కాజేశారు.
చిత్తిరై అమావాస్య సందర్భంగా మంగళవారం రామేశ్వరం(Rameswaram) అగ్ని తీర్థం వద్ద భక్తులు పితృదేవతలకు తర్పణాలు వదిలేందుకు వేల సంఖ్యలో గుమికూడారు.
కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లా అంతటా మూడో రోజూ సముద్రతీర ప్రాంతాల్లో రాక్షస అలలు ఎగసిపడ్డాయి. పదడుగుల నుంచి 15 అడుగుల ఎత్తుకు అలలు తీరం వైపు దూసుకువచ్చాయి.