Home » Tamil Nadu
తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే డబ్లింగ్కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లావాసుల సంవత్సరాల కల నెరవేరింది
తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య సుమారు రూ.1,332 కోట్ల ఖర్చుతో 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందువల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
సుప్రీంకోర్టు నుంచి తమిళనాడు ప్రభుత్వానికి లభించిన ఊరటపై అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పుతో గవర్నర్ నిలిపి ఉంచిన బిల్లులన్నీ ఇప్పుడు ఆయన ఆమోదముద్ర పడి చట్టరూపం దాలుస్తాయని చెప్పారు.
సెల్ఫోన్ ఓ విద్యార్థిని ప్రాణంతీసింది. ఎక్కడో దూరంగా వేరే రాష్ట్రంలో ఉన్న తన తండ్రితో సెల్ఫోన్లో మాట్లాడుతూ ఆదమరిచి డాబాపై నుంచి ఒక్కసారిగా కిందపడిపోయింది. గమనించిన చుట్టుపక్కలవారు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లాలో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా అరటి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే.. తిరుప్పూరులో కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
ఈనెల 12వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 12 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Governor RN Ravi: తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ ఆర్ ఎన్ రవి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంలో గవర్నర్ వ్యవహారం సరిగా లేదని మందలించింది.
కునాల్ కామ్రా వివాదాస్పద వ్యాఖ్యలపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆయన ఇటీవల మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయనకు తాత్కాలిక ముందస్తు బెయిలు మంజూరు చేసింది.
తమిళనాడుకు కేంద్రం కేటాయింపులపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రాజేశాయి. గతంతో పోలిస్తే.. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే తమిళనాడుకు భారీగా నిధులు కేటాయించామన్న మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత పీ చిదంబరం కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు రామేశ్వరంలోని పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడులో మౌలిక సదుపాయాల కల్పనకు గత పదేళ్లలో భారీగా నిధులిచ్చామని చెప్పారు. 2014 కంటే ముందుతో పోల్చుకుంటే గత పదేళ్లలో తమిళనాడు అభివృద్ధికి మూడు రెట్లు అధికంగా నిధులిచ్చామన్నారు.