Home » Chennai News
మదురైలో శనివారం కురిసిన అకాల వర్షం వాతావరణాన్ని చల్లబరిచినప్పటికీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీర ప్రాంతంలో వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి.
భార్య వివాహేతర సంబంధాన్ని జీర్ణించుకోలేని భర్త తన ఇద్దరు పిల్లలను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న విషాదక ఘటన శనివారం నగరంలో చోటుచేసుకుంది. వెస్ట్ మాంబాళం కృష్ణప్ప నాయకర్ వీధికి చెందిన మోహన్ (55) పాత ఇనుప వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు భార్య యమున, సాయి స్వాతి (13), తేజర్ (5) అనే ఇద్దరు పిల్లలున్నారు.
కష్టానష్టాల్లో తోడునీడగా నిలిచిన భార్య హఠాత్తుగా మృతి చెందటంతో చలించిపోయిన భర్త, ఆమె జ్ఞాపకాలను పదిలపరచుకునేలా గుడికట్టి కుంభాభిషేకం జరిపి ఆరాధిస్తున్నాడు.
సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ‘మీ బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు హవాలా డబ్బు వెళ్లింది’ అని బెదిరించి నగరవాసి నుంచి రూ. 91.64 లక్షలు కాజేశారు.
చిత్తిరై అమావాస్య సందర్భంగా మంగళవారం రామేశ్వరం(Rameswaram) అగ్ని తీర్థం వద్ద భక్తులు పితృదేవతలకు తర్పణాలు వదిలేందుకు వేల సంఖ్యలో గుమికూడారు.
కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లా అంతటా మూడో రోజూ సముద్రతీర ప్రాంతాల్లో రాక్షస అలలు ఎగసిపడ్డాయి. పదడుగుల నుంచి 15 అడుగుల ఎత్తుకు అలలు తీరం వైపు దూసుకువచ్చాయి.
కేరళ నుంచి తమిళనాడులోని సేలంకు రూ.666 కోట్ల విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలతో బయలుదేరిన కంటైనర్ ఈరోడ్డు జిల్లా చిత్తోడ్ సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్తో పాటు సెక్యూరిటీ గార్డు గాయపడ్డారు.
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు పగటిపూట బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
తన ప్రేమను వ్యతిరేకించాడనే కోపంతో విషం కలిపిన చికెన్ రైస్(Chicken rice) ఇచ్చి తాతను హతమార్చిన మనవడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
చెన్నై జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రాత్రిపూట ల్యాండింగ్ అవుతున్న విమానాలపై ఎక్కడి నుంచో లేజర్ కాంతులు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ లేజర్కాంతులు వేస్తున్న దుండగుల ఆచూకీ కోసం విమానాశ్రయ పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.