Share News

Durgamma Temple: విజయవాడ దుర్గమ్మకు బంగారు బోనం..

ABN , Publish Date - Jul 14 , 2024 | 02:39 PM

ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు హైదరాబాద్‌లోని భాగ్యనగర్ మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయ కమిటీ కాసేపట్లో బంగారు బోనం సమర్పించనుంది. మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఛైర్మన్ రాకేష్ తివారి ఆధ్వర్యంలో బోనం సమర్పించనున్నారు. ప్రతి ఏడాది అమ్మవారికి బంగారు బోనం ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నట్లు జోగిని విశాక్రాంతి చెప్పారు.

Durgamma Temple: విజయవాడ దుర్గమ్మకు బంగారు బోనం..

విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు హైదరాబాద్‌లోని భాగ్యనగర్ మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయ కమిటీ కాసేపట్లో బంగారు బోనం సమర్పించనుంది. మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఛైర్మన్ రాకేష్ తివారి ఆధ్వర్యంలో బోనం సమర్పించనున్నారు. ప్రతి ఏడాది అమ్మవారికి బంగారు బోనం ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నట్లు జోగిని విశాక్రాంతి చెప్పారు. ఈ నేపథ్యంలో జమ్మిదొడ్డిలోని బ్రాహ్మణ వీధి నుంచి భారీ ఊరేగింపు నడుమ బోనం ఉరేగింపు సాగుతోంది. వివిధ వేషధారణలు ధరించిన సుమారు వెయ్యి మంది కళాకారులతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భారీ ఊరేగింపు ఉత్సవం సాగుతోంది. జమ్మిదొడ్డి నుంచి ఇంద్రకీలాద్రి వరకు కాలి నడకన ఉరేగింపు అనంతరం అమ్మవారికి జోగిని విశాక్రాంతి బంగారు బోనం సమర్పిస్తారు.

Updated Date - Jul 14 , 2024 | 02:43 PM