Share News

Trump Election Campaign: ట్రంప్ ఎన్నికల ప్రచార హ్యాకింగ్ కేసులో కీలక అప్‌డేట్

ABN , Publish Date - Sep 28 , 2024 | 08:26 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇరాన్, చైనా, రష్యా దేశాలు సైబర్ దాడులు చేశాయా? మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇటివల ట్రంప్ ప్రచార హ్యాకింగ్ కేసు విషయంలో అమెరికన్ గ్రాండ్ జ్యూరీ కీలక నిర్ణయం తీసుకుంది.

Trump Election Campaign: ట్రంప్ ఎన్నికల ప్రచార హ్యాకింగ్ కేసులో కీలక అప్‌డేట్
Case against 3 Iranians Trump election

మరికొన్ని రోజుల్లో అగ్రరాజ్యం అమెరికా(america)లో అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అనేక దేశాలు ఇప్పుడు ఈ ఎన్నికలపై ఆసక్తిగా ఉన్నాయి. ఇదే సమయంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని(Trump election campaign) హ్యాకింగ్(hacking) చేశారనే విషయం ఇటివల వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై అమెరికాలోని గ్రాండ్ జ్యూరీ ముగ్గురు ఇరానియన్లపై కేసులు నమోదు చేసింది. ఇరాన్, చైనా, రష్యాలు అమెరికాలో ఎన్నికలలో జోక్యం చేసుకోవడంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో అమెరికన్ గ్రాండ్ జ్యూరీ ఈ నిర్ణయం తీసుకుంది.


కీలకమైన పత్రాలు

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తరపున హ్యాకింగ్ ఆపరేషన్ చేయడానికి ముగ్గురు ఇరాన్ అనుమానితులు అనేక ఇతర హ్యాకర్లతో కలిసి కుట్ర పన్నారని US అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కీలకమైన పత్రాలు దొంగిలించబడ్డాయని, ఇది ఇరాన్ సైబర్ గూఢచర్య ఆపరేషన్‌ అని ఆరోపణలు వచ్చాయి. ఈ హ్యాకర్లు సమాచారాన్ని చాలా మంది జర్నలిస్టులకు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచారంతో సంబంధం ఉన్న ప్రముఖులకు పంపారని ఆరోపించారు. ఇది అధ్యక్షుడు జో బైడెన్ ఉపసంహరించుకోకముందే జరిగిందని అంటున్నారు.


వ్యక్తుల ఖాతాలు టార్గెట్

నిందితుల వాంగ్మూలాలను ప్రస్తావిస్తూ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని బలహీనపరిచేందుకు పలువురు ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తుందని కోర్టు తెలిపింది. హ్యాకర్లు 'ఒక పెద్ద హ్యాకింగ్ ప్లాన్ చేసి అందులో పాల్గొన్నారని కోర్టు వెల్లడించింది. వీటిలో స్పియర్-ఫిషింగ్, రాజకీయ ప్రచారాలతో సంబంధం ఉన్న అనేక US ప్రభుత్వ అధికారులు, వ్యక్తుల ఖాతాలను సోషల్ ఇంజినీరింగ్ పద్ధతుల ద్వారా హ్యాక్ చేశారని కోర్టు స్పష్టం చేసింది. ఇరాన్ వలె యునైటెడ్ స్టేట్స్ జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించే వ్యక్తులు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారని కోర్టు తెలిపింది.


2020 నుంచే

ఈ హ్యాకింగ్ ప్రయత్నాలు 2020లోనే ప్లాన్ చేసినట్లు కోర్టు పత్రాలు వెల్లడించాయి. ఈ ఏడాది మేలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వ్యక్తుల వ్యక్తిగత ఖాతాలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుని అక్రమ మార్గాల ద్వారా వాటిని యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించారని కోర్టు తెలిపింది. US ట్రెజరీ డిపార్ట్‌మెంట్ కూడా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంది. ఈరోజు అభియోగాలు మోపబడిన ముగ్గురు హ్యాకర్లలో ఒకరైన మసూద్ జలీలీతో సహా ఏడుగురు ఇరానియన్లపై ఆంక్షలు విధించింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా, చైనాలు జోక్యం చేసుకుంటున్నాయని అమెరికా ఆరోపించింది. ఈ ఆరోపణలను రష్యా, చైనాలు తీవ్రంగా ఖండించాయి.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Read More International News and Latest Telugu News

Updated Date - Sep 28 , 2024 | 08:28 AM