Share News

వైద్యం కోసం వచ్చి వైద్యుడిని చంపిన టీనేజర్లు

ABN , Publish Date - Oct 04 , 2024 | 04:17 AM

ఢిల్లీలో దారుణం జరిగింది. ఇద్దరు టీనేజర్లు వైద్యం కోసమంటూ వచ్చి వైద్యుడినే చంపేశారు.

వైద్యం కోసం వచ్చి వైద్యుడిని చంపిన టీనేజర్లు

న్యూఢిల్లీ, అక్టోబరు 3: ఢిల్లీలో దారుణం జరిగింది. ఇద్దరు టీనేజర్లు వైద్యం కోసమంటూ వచ్చి వైద్యుడినే చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 16 ఏళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలు బుధవారం అర్ధరాత్రి దాటాక కాలి గాయాలకు డ్రస్సింగ్‌ చేయించుకోవడం కోసమంటూ కాళింది కుంజ్‌ ప్రాంతంలోని నిమా అనే ఆస్పత్రికి వచ్చారు. చికిత్స తీసుకున్న అనంతరం వైద్యుడు జావేద్‌ అక్తర్‌ క్యాబిన్‌కు వెళ్లి ఆయనపై కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దానికి అక్కడికి వచ్చిన ఆస్పత్రి సిబ్బందికి జావేద్‌ రక్తపుమడుగులో విగత జీవిగా కన్పించారు. వ్యక్తిగత కక్షల కారణంగానే పథకం ప్రకారం వైద్యుడిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Updated Date - Oct 04 , 2024 | 04:17 AM