సీఎం రమేశ్పై కేసు నమోదు
ABN , Publish Date - Apr 06 , 2024 | 03:05 AM
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్ ్స అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చోడవరం(అనకాపల్లి జిల్లా), ఏప్రిల్ 5: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్ ్స అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చోడవరం శివారు గాంధీ గ్రామంలోని శిలపరశెట్టి రామకృష్ణ, శిలపరశెట్టి బుజ్జికి చెందిన టైల్స్ దుకాణంపై డీఆర్ఐ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సమాచారం తెలియడంతో సీఎం రమేశ్, మాజీ ఎమ్మెల్యే కేఎ్సఎన్ఎస్ రాజు, టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో దుకాణం వద్దకు చేరుకున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పిన సీఎం రమేశ్ అక్కడినుంచి వెనుదిరిగారు. అయితే తమ విధులకు ఆటంకం కలిగించారంటూ డీఆర్ఐ ఏడీ ఎంఎ్సఆర్కే సోమేశ్ గురువారం రాత్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఎం రమేష్, కేఎ్సఎన్ఎస్ రాజు, టైల్స్ వ్యాపారి రామకృష్ణ, అతని సోదరుడు బుచ్చిబాబు, వారి ఇద్దరు కుమార్తెలపై పోలీసులు కేసు నమోదు చేశారు.