మైక్రోసాఫ్ట్లో మరో కీలక పదవిలో తెలుగు తేజం పవన్
ABN , Publish Date - Mar 27 , 2024 | 01:50 AM
మైక్రోసా్ఫ్టలో మరో తెలుగు తేజానికి కీలక పదవి లభించింది. మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్ఫేస్ విభాగం బాస్గా పవన్ దావులూరి నియమితులయ్యారు.
విండోస్-సర్ఫేస్ హెడ్గా నియామకం
వాషింగ్టన్, మార్చి 26: మైక్రోసా్ఫ్టలో మరో తెలుగు తేజానికి కీలక పదవి లభించింది. మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్ఫేస్ విభాగం బాస్గా పవన్ దావులూరి నియమితులయ్యారు. ఇంతవరకు ఈ పదవిని నిర్వహించిన పనోస్ పనయ్ గత ఏడాది రాజీనామా చేసి అమెజాన్లో చేరడంతో ఆయన స్థానంలో పవన్ను నియమించారు. గతంలో విండోస్, సర్ఫేస్ అంశాలకు రెండు విభాగాలు ఉండేవి. సర్ఫేస్ సిలికాన్ వర్క్ విభాగాన్ని పవన్ దావులూరి చూసేవారు. ప్రస్తుతం రెండు విభాగాలను ఏకం చేసి ఆయనను అధిపతిగా నియమించారు. ఐఐటీ-మద్రాసులో విద్యాభ్యాసం చేసిన ఆయన 1999లో మేరీలాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ్స.పట్టా పొందారు. అనంతరం మైక్రోసా్ఫ్టలో చేరి గత 23 ఏళ్లుగా వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. 2001లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్గా ఉద్యోగంలో చేరారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఇప్పటికే సత్య నాదెళ్ల వ్యవహరిస్తుండగా ప్రస్తుతం ఆ కోవలో పవన్ చేరారు.