Share News

Bihar: దంపతులు ఆత్మహత్య: పోలీస్‌స్టేషన్‌పై బంధువుల దాడి

ABN , Publish Date - May 18 , 2024 | 01:18 PM

పోలీస్ స్టేషన్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన వారి బంధువులు, స్థానికులు పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి.. తగులబెట్టారు. ఈ ఘటన బిహార్‌‌లో అరారియా జిల్లాలోని తారబారి గ్రామంలో చోటు చేసుకుంది.

Bihar: దంపతులు ఆత్మహత్య: పోలీస్‌స్టేషన్‌పై బంధువుల దాడి

పాట్నా, మే 18: పోలీస్ స్టేషన్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన వారి బంధువులు, స్థానికులు పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి.. తగులబెట్టారు. ఈ ఘటన బిహార్‌‌లో అరారియా జిల్లాలోని తారబారి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. భార్య గతేడాది మరణించింది. దీంతో ఆమె సోదరిని రెండు రోజుల క్రితం అతడు వివాహం చేసుకున్నాడు.

AP News: అగ్రిగోల్డ్ భూముల్లో కలప లేపేసిన వైసీపీ దొంగలు..

అయితే పెళ్లి కుమార్తె వయస్సు 14 ఏళ్లు. ఆ క్రమంలో మైనర్‌ను వివాహం చేసుకున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. దాంతో ఆ దంపతులను గురువారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఆ క్రమంలో పోలీస్ కస్టడీలో వారు ఆత్మహత్య చేసుకున్నారు.


అయితే ఈ దంపతుల ఆత్మహత్య వార్త ఆ ప్రాంతంలో నిమిషాల్లో వ్యాప్తించింది. దీంతో వారి బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం కట్టలు తెంచుకొంది. దీంతో వారంత పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. అయితే పోలీసులకు వ్యతిరేకంగా గ్రామస్తులు, బంధువులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

Simhadri Appanna: సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు వెంటన తారబరి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఆ దంపతులను పోలీసులు నిర్బంధించి దాడి చేయడం వల్లే వారు ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఈ దాడిలో అయిదుగురు పోలీసులు గాయపడ్డారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 18 , 2024 | 01:55 PM