Share News

ఎన్‌డీఏకు 200 సీట్లు కష్టమే: ఖర్గే

ABN , Publish Date - May 17 , 2024 | 04:02 AM

ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

ఎన్‌డీఏకు 200 సీట్లు కష్టమే: ఖర్గే

భువనేశ్వర్‌, మే 16: ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. గురువారం భువనేశ్వర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 200 సీట్లు సంపాదించడానికే ఎన్‌డీఏ తంటాలు పడుతోందని, అందువల్ల కేంద్రంలో ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే లేదని చెప్పారు.

దక్షిణాదిలో బీజేపీకి సీట్లేమీ రావని, ఉత్తరాదిలో సీట్లు సగానికి సగం తగ్గుతాయన్నారు. ఒడిసాలోనూ బీజేడీ, బీజేపీలతో ప్రజలు విసిగిపోయారని, అందువల్ల కాంగ్రె్‌సను ఆదరిస్తున్నారని చెప్పారు. బీజేపీకి గెలిచే స్థానాలు ఇంకెక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు అమలు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులు కాపాడేది కాంగ్రెస్‌ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

Updated Date - May 17 , 2024 | 05:53 AM