పార్లమెంటు సమావేశాలు ఒక రోజు పొడిగింపు
ABN , Publish Date - Feb 07 , 2024 | 03:56 AM
పార్లమెంటు సమావేశాలను ఒక రోజు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సమావేశాలు శుక్రవారమే ముగియాల్సి ఉంది. కానీ, ఈ నెల పదో తేదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: పార్లమెంటు సమావేశాలను ఒక రోజు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సమావేశాలు శుక్రవారమే ముగియాల్సి ఉంది. కానీ, ఈ నెల పదో తేదీ శనివారం వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం తెలిపారు. 2014కు ముందు.. ఆ తరువాత ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా ఈ పొడిగింపు ప్రాధాన్యం సంతరించుకొంది.