Share News

ప్రశాంత్‌ కిశోర్‌ సొంత పార్టీ జన్‌ సురాజ్‌ ప్రారంభం

ABN , Publish Date - Oct 03 , 2024 | 05:44 AM

మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ బిహార్‌లో తన సొంత పార్టీ జన్‌ సురాజ్‌ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. దీంతో సుదీర్ఘకాలంగా సొంత పార్టీని ప్రారంభించాలన్న ఆయన లక్ష్యం నెరవేరింది.

ప్రశాంత్‌ కిశోర్‌ సొంత పార్టీ జన్‌ సురాజ్‌ ప్రారంభం

పట్నా, అక్టోబరు 2: మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ బిహార్‌లో తన సొంత పార్టీ జన్‌ సురాజ్‌ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. దీంతో సుదీర్ఘకాలంగా సొంత పార్టీని ప్రారంభించాలన్న ఆయన లక్ష్యం నెరవేరింది. రానున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ అన్ని సీట్లకూ పోటీ చేయనున్నట్లు సమాచారం. అధికారంలోకి వస్తే మద్యనిషేధాన్ని పూర్తిగా ఎత్తివేస్తామని ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటించారు. ప్రస్తుతం బిహార్‌లో సాగుతోన్న కులం, ఎన్నికల తాయిలాల రాజకీయాన్ని మార్చి రాష్ట్రానికి ఉజ్వల భవిత కల్పించడమే తమ లక్ష్యమని ఆయన చెబుతున్నారు. జన్‌ సురాజ్‌ పార్టీ ప్రారంభ కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రి దేవేంద్ర ప్రసాద్‌ యాదవ్‌, పవన్‌ వర్మ, మాజీ ఎంపీ మోనజీర్‌ హసన్‌ వంటి వారు హాజరయ్యారు. మాజీ ఐఎ్‌ఫఎస్‌ అధికారి మనోజ్‌ భారతిని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించారు.

Updated Date - Oct 03 , 2024 | 05:44 AM