Share News

Video: మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి.. విద్యార్థులతో ఏం మాట్లాడారంటే

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:24 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) బుధవారం మెట్రోలో ప్రయాణించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ మెట్రో(Delhi Metro) వద్దకు చేరుకుని టికెట్ తీసుకుని ట్రైన్లో ప్రయాణించారు.

Video: మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి.. విద్యార్థులతో ఏం మాట్లాడారంటే

ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) బుధవారం మెట్రోలో ప్రయాణించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ మెట్రో(Delhi Metro) వద్దకు చేరుకుని టికెట్ తీసుకుని ట్రైన్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

పరీక్షల సమయం కావడంతో ధైర్యంగా ఉండాలని, ఒత్తిడికి లోనుకాకుడదని సూచించారు. పరీక్షల్లో మంచి ప్రతిభ చూపేందుకు సూచనలు చేశారు. ఆ తరువాత పలువురు ప్రయాణికులతో మాట్లాడారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆ హోదాలో మెట్రోలో ప్రయాణించడం ఇదే తొలిసారి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 07 , 2024 | 04:25 PM