Share News

Puri Ratna Bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. లోపలకి వెళ్లిన బృందం

ABN , Publish Date - Jul 14 , 2024 | 02:09 PM

పూరీ జగన్నాథ స్వామి రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ఆధివారం ప్రారంభమైంది. ఆ క్రమంలో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. మరికాసేపట్లో రత్న భాండాగారాన్ని అధికారులు తెరవనున్నారు.

Puri Ratna Bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. లోపలకి వెళ్లిన బృందం
Puri Temple

భువనేశ్వర్, జులై 14: పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరచుకుంది. ఆలయ పూజారులు ప్రత్యేక పూజల అనంతరం రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు. ఈ రత్నభాండాగారాన్ని మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. మూడో గదిలోకి 11 మందితో కూడిన ఒక బృందం వెళ్లింది. ఆ గదిలోని నిధిని బయటకు తీసుకొచ్చేందుకు ఆరు భారీ పెట్టెలను భాండాగారంలోకి తీసుకెళ్లారు. ఈ పూరీ రత్నభాండాగారంలో మొత్తం మూడు గదులున్నాయి. వాటిలో మొదటి గదిని స్వామి వారికి పూజలో భాగంగా ప్రతీ రోజు తీస్తారు. ఇక రెండో గదిని అతి ముఖ్య సందర్భాల్లో మాత్రమే తెరుస్తారు.


ఆ యా రోజుల్లో స్వామి వారికి ఆ గదిలోని విలువైన నగలను అలంకరిస్తారు. అయితే మూడో గదిని మాత్రం 46 ఏళ్ల క్రితం తెరిచారు. అంటే.. ఈ గదిని 1978లో తెరిచారు. అనంతరం మళ్లీ తెరవలేదు. దీంతో ఆ గదిలో అంతులేని సంపద ఉందని తెలుస్తుంది. ఈ గదికి నాగ బంధం కూడా ఉండడంతో.. అన్ని రక్షణ చర్యలు తీసుకున్నారు. ఇక ఆ గదిలో నిధులు, నిక్షేపాలకు రక్షణగా పాములున్నాయని సమాచారం.

బృందంలో పాములు పట్టే వ్యక్తులు ఉన్నారు. అలాగే ఎలాంటి అత్యవసర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు వైద్యులను కూడా అందుబాటులో ఉంచారు. రత్నభాండాగారం తెరిచే ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆ యా పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.


రత్నభాండాగారంలోని సంపదను ఆ యా పెట్టెల్లో కమిటీ సభ్యులు భద్రపరచున్నారు. అందుకోసం ఆ పెట్టలను భాండాగారంలోకి తీసుకు వెళ్లారు. అలాగే ఆ యా ఆభరణాలను డిజిటల్ డాక్యుమెంటేషన్ చేసి.. అనంతరం వాటిని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేశారు. 1978లో ఈ భాండాగారంలో సంపదను లెక్కించేందుకు 72 రోజుల సమయం పట్టిందని సమాచారం.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 14 , 2024 | 03:25 PM