Share News

Ram Mandir: కీలక ఘట్టం ఆవిష్కృతం.. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అర్చకులు

ABN , Publish Date - Jan 19 , 2024 | 02:38 PM

అయోధ్యలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ప్రతిష్ఠాపన సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముడికి సంబంధించిన కొత్త ఫొటోలను ఆలయ అధికారులు విడుదల చేశారు.

Ram Mandir: కీలక ఘట్టం ఆవిష్కృతం.. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అర్చకులు

అయోధ్య: అయోధ్యలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ప్రతిష్ఠాపన సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముడికి సంబంధించిన కొత్త ఫొటోలను ఆలయ అధికారులు విడుదల చేశారు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన ఈ విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున అయోధ్యకు తీసుకువచ్చారు. 51 అంగులాల పొడవు ఉన్న విగ్రహం.. పై భాగాన్ని తెల్లని వస్త్రంతో కప్పి ఉంచారు.

బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చే సమయంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు రామ నామాన్ని స్మరించారు. గురువారం ఉదయం రాముడి విగ్రహాన్ని పవిత్ర నదీ జలాలతో అభిషేకించారు. తర్వాత గణేశాంబికా పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యాహవచనం క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు డాక్టర్‌ అనిల్‌ మిశ్రా దంపతులు పూజల్లో పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన బాల రాముడి విగ్రహ కళ్ల గంతలను విప్పుతారు. ప్రధాని మోదీ.. రామ్ లల్లాను దర్శించుకొని హారతి ఇస్తారని అయోధ్య ఆలయ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jan 19 , 2024 | 02:38 PM