Home » Ayodhya Ram mandir
అయోధ్యలోని రామ మందిరం ఇటీవల బాంబు బెదిరింపునకు గురైంది. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆలయ భద్రత, అప్రమత్తతను పరీక్షించడానికి, భక్తుల భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అయోధ్య రామాలయం భద్రతకు సంబంధించి బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం రాత్రి ఈ బెదరింపు మెయిల్ వచ్చినట్టు గుర్తించారు.
శ్రీరామ నవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరంలో అద్భతం ఆవిష్క్రుతమైంది. సూర్యకిరణాలు నేరుగా బాల రాముడి నుదుటిపై పడడాన్ని తిలకించిన భక్తలు పులకించిపోయారు.
మహాకుంభమేళా సందర్భంగా అయోధ్య బాల రాముడి దర్శనార్థం వస్తున్న భక్తుల సౌకర్యార్థం ఆలయ దర్శన, నిష్క్రమణ ద్వారాలను విస్తరించాలని ప్రణాళికలు రూపొందించినట్లు నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర తెలిపారు. దీనికి సంబంధించి నిర్మాణ కమిటీలోని ముఖ్య సభ్యులందరూ నేడు ఆలయాన్ని పరిశీలించి చర్యలు చేపడతారని చెప్పారు.
అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 85 ఏళ్ల మహంత్ సత్యేంద్ర దాస్.. ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలు విడిచారు.
భక్తులు భారీగా తరలివస్తుండటం, అందులోనూ ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వస్తున్న భక్తులతో అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఆలయ దర్శనం,హారతి వేళల్లో సవరణ చోటుచేసుకుంది.
ఎనభై ఐదేళ్ల సత్యేంద్ర దాస్ను ప్రాథమిక చికిత్స అనంతరం ఆదివారంనాడు ఎస్జీపీజీఐ ఆసుపత్రికి తరలించారు. మధుమేహం, హైపర్టెన్సివ్తో ఆయన బాధపడుతున్నారని, ప్రస్తుతం న్యూరాలజీ వార్డ్ హెచ్డీయూ (హై డెపెన్డెన్సీ యూనిట్)లో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
భారీగా తరలి వచ్చిన భక్తజనసందోహం మధ్య అయోధ్యలోని రామమందిరం తొలి వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
సమాజం ఎందుకు విడిపోయి ఉంది? ఆలయం లేకుండా సుదీర్ఘం కాలం రాముడు, మన దేవుళ్లు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? అనేది ప్రజలు ఆలోచించాలని ఆదిత్యనాథ్ కోరారు.
కొత్త సంవత్సరం తొలిరోజున 2 లక్షల మందికి పైగా భక్తులు భవ్య రామమందిరంలోని రామ్లల్లాను దర్శించుకున్నట్టు జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బుధవారంనాడు తెలిపింది.