Share News

తమిళిసై.. లోక్‌సభకు నై

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:30 AM

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. మార్చి 18న గవర్నర్‌ పదవికి రాజీనామా చేసి.. ఆమె సొంత నియోజకవర్గం చెన్నై సౌత్‌ నుంచి బీజేపీ

తమిళిసై.. లోక్‌సభకు నై

చెన్నై సౌత్‌ నుంచి ఓటమిపాలైన మాజీ గవర్నర్‌

హైదరాబాద్‌, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. మార్చి 18న గవర్నర్‌ పదవికి రాజీనామా చేసి.. ఆమె సొంత నియోజకవర్గం చెన్నై సౌత్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. తమిళిసైని డీఎంకే అభ్యర్థి సుమతి 2లక్షలకు పైగా మెజార్టీతో ఓడించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన తమిళిసై.. శాసనసభ, లోక్‌సభ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ గెలవలేదు.

Updated Date - Jun 05 , 2024 | 05:30 AM