Share News

NRI: ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు

ABN , Publish Date - May 20 , 2024 | 03:54 PM

హాంగ్‌కాంగ్‌లో తెలుగు వారంతా కలిసి ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

NRI: ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు

ఎన్నారై డెస్క్: హాంగ్‌కాంగ్‌లో తెలుగు వారంతా (NRI) కలిసి ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు కే. వెంకట రమణ - కాన్సల్, కన్సుల్టే జనరల్ అఫ్ ఇండియా, హాంగ్‌కాంగ్, మకావ్; మాస్. ఏమి యుంగ్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ (ఐలాండ్స్), హాంగ్‌కాంగ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్; లాల్ హర్దసాని - ప్రెసిడెంట్, ది హిందూ అసోసియేషన్; ఉస్తాద్ గులాం సిరాజ్, చైర్మన్, పుంహక, కె. వెంకట వంశీధర్, రీజినల్ హెడ్, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, ముఖ్య అతిథులుగా విచ్చేసారు.

2.jpgవెంకట రమణ దీప ప్రజ్వలన చేయగా, ఇతర ముఖ్య అతిథులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తదనంతరం వెంకట రమణ, హాంగ్‌కాంగ్‌లో తెలుగు వారు సమాఖ్య ద్వారా చేస్తున్న భాష సేవ - సాంస్కృతిక పరిరక్షణను కొనియాడారు. తదనంతరం శంకరంబాడి సుందరాచారి రచన "మా తెలుగు తల్లికి మల్లె పూదండ" గానంతో ప్రారంభైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలు, ఫ్లూట్, యుకెలేలే వాయిద్యాలపై టాలీవుడ్ పాటలు, ఫ్యూజన్ డ్యాన్స్, పాత క్లాసిక్ మెడ్లీలకు నృత్యం వంటి విభిన్నమైన ఆట పాటలతో, హాస్య నాటిక తో కార్యక్రమం ఆసాంతం ఆకట్టుకుంది.

NRI: సెయింట్ లూయిస్‌లో బ్రహ్మోత్సవాలకు భారీగా నిధుల సేకరణ!

3.jpg


గౌరవనీయ అతిథులు కాన్సల్ వెంకట రమణ, మిస్ మాస్. ఏమి యుంగ్ సమాఖ్యలోని స్వచ్ఛంద సేవకులకు, తెలుగు బడి గురువులకు, స్థానికంగా జరిగే జాతీయ అంతర్జాతీయ మారథాన్లలో, ఆక్స్‌ఫామ్ ట్రయిల్ వాకర్‌లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిన వారి ప్రతిభను గుర్తిస్తూ వారికి మొమెంటోలు అందించారు.

సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి కార్యక్రమ వివరాలిస్తూ, హాంగ్‌కాంగ్‌లో నివసిస్తున్న తెలుగువారు సంప్రదాయ వస్త్రధారణతో హాజరైన సభ్యులతో తెలుగుతనం వెల్లివిరిసిన ఈ వేడుకలతో తెలుగు నేలను మరిపించిందని హర్షం తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరం కనుక ఇక్కడ తమకి పెద్ద హాల్ల్స్ అందుబాటులో ఉండవని, ప్రభుత్వ వసతులు లభ్యమైనప్పుడు వేడుకలు చేసుకుంటున్నామని, అందుకీ ఉగాది వేడుకలు చేసుకోవడం కొంత ఆలస్యమయ్యిందని వివరించారు. జూన్‌లో తమ సంస్థ క్రీడా దినోత్సవానికి సిద్ధమవుతున్నామని చెప్పారు.

4.jpgసమాఖ్య కార్యవర్గ సభ్యులు జయ పీసపాటి, రాజశేఖర్ మన్నే, రమేష్ రేణిగుంట్ల, హరీన్ తుమ్మల, రమాదేవి సారంగా, మాధురి కొండా, ఇతర సభ్యులు అపర్ణ కంద, రాధికా సంబతూర్, ప్రత్యుష & రవికాంత్ గునిశెట్టి, కల్పన & జయసురేష్ మట్టపర్తి, ప్రియాంక & బాబీ సత్తినేని, కృష్ణ ప్రసాద్ రెడ్డి, భరత్ కోరాడ, ధర్మ రాజు దుంప, సుగుణ రవి, మానస గర్దాస్, శాంతి పలుకూరి తదితరులు ఉగాది వేడుకల నిర్వాహణలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - May 20 , 2024 | 03:54 PM