బొబ్బిలిలో డ్రగ్స్ అవగాహన సదస్సు

ABN, Publish Date - Oct 01 , 2024 | 10:53 AM

విజయనగరం జిల్లా: మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలపై యువతను చైతన్యపరిచి.. మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సంకల్పం’ కార్యక్రమాన్ని సోమవారం బొబ్బిలి పట్టణంలోని శ్రీ సూర్య ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ ప్రత్యేక అతిథిగా.. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 బొబ్బిలిలో డ్రగ్స్ అవగాహన సదస్సు 1/6

బొబ్బిలిలో నిర్వహించిన మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన సదస్సులో నటుడు సాయికుమార్..

 బొబ్బిలిలో డ్రగ్స్ అవగాహన సదస్సు 2/6

యువతను మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుడదంటూ 'సంకల్పం' కార్యక్రమంలో పిలుపునిచ్చిన ప్రముఖ నటుడు సాయికుమార్..

 బొబ్బిలిలో డ్రగ్స్ అవగాహన సదస్సు 3/6

'సంకల్పం' కార్యక్రమంలో ప్రసంగిస్తున్న విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్...

 బొబ్బిలిలో డ్రగ్స్ అవగాహన సదస్సు 4/6

నటుడు సాయికుమార్ 'సంకల్పం' కార్యక్రమంలో విజయనగరం జిల్లా డీఎస్పీ శ్రీనివాసరావు ముచ్చటిస్తున్న దృశ్యం..

 బొబ్బిలిలో డ్రగ్స్ అవగాహన సదస్సు 5/6

మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా 'సంకల్పం' కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేస్తున్న నటుడు సాయికుమార్, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు..

 బొబ్బిలిలో డ్రగ్స్ అవగాహన సదస్సు 6/6

మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా బొబ్బిలిలో నిర్వహించిన 'సంకల్పం' కార్యక్రమంలో కళాకారులు, నిర్వాహకులతో నటుడు సాయికుమార్..

Updated at - Oct 01 , 2024 | 10:53 AM