IPL 2024: అదిరిపోయే వేడుకలతో ఐపీఎల్ 2024 ఆరంభం.. కాసేపట్లో తొలి మ్యాచ్
ABN , Publish Date - Mar 22 , 2024 | 07:13 PM
క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 ఆరంభమైంది. అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్ సెర్మనీ ఈవెంట్స్ అలరించాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్కు ఆతిథ్యమిస్తున్న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోలాహలంగా వేడుకలు జరిగాయి. ఆరంభ వేడుకల్లో ప్రదర్శన చేసినవారిలో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్తో పాటు సింగర్ సోనూ నిగమ్, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ప్రదర్శన ఇచ్చారు.
చెన్నై: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 ఆరంభమైంది. అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్ సెర్మనీ ఈవెంట్స్ అలరించాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్కు ఆతిథ్యమిస్తున్న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోలాహలంగా వేడుకలు జరిగాయి. ఆరంభ వేడుకల్లో ప్రదర్శన చేసినవారిలో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్తో పాటు సింగర్ సోనూ నిగమ్, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ప్రదర్శన ఇచ్చారు. క్రికెట్ ఫ్యాన్స్ అరుపులు, కేకలతో మైదానం మోతెక్కింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ సీఎస్కే, ఆర్సీబీ మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవనుండగా.. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.05 గంటల వరకు ఓపెనింగ్ సెర్మనీ కార్యక్రమాలు జరిగాయి.
కాగా సీఎస్కే, ఆర్సీబీ జట్ల మ్యాచ్ ఇన్నింగ్స్ బ్రేక్లో స్వీడన్కు చెందిన ప్రముఖ డీజే, రికార్డ్ ప్రొడ్యూసర్, రీమిక్సర్ డీజే ఆక్స్వెల్.. లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి వెల్లడించింది. కాగా మరికొద్ది సేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.