పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ABN , Publish Date - Mar 24 , 2024 | 10:16 PM
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-05 బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
కోటపల్లి, మార్చి 24: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-05 బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఆత్మీయంగా పలుకరించుకుని విందు, వినోదాలతో సాయంత్రం వరకు సందడిగా గడిపారు. నాటి ఉపాధ్యాయులు మల్లారెడ్డి, లక్ష్మణ్రావు, రమణరావు, శ్రీనివాస్, నీలేష్ కచ్వాల్, శ్రీనివాస్, విజయలక్ష్మీలను పూర్వ విద్యార్థులు సన్మానించారు.పూర్వ విద్యార్థులు కొంకటి సుందర్, రాజేష్, శంకర్, గోనె మోహన్రెడ్డి, శారద , సంపత్ తదితరులు పాల్గొన్నారు.