కొత్తూర్లో క్రికెట్ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Jan 01 , 2024 | 10:28 PM
నియోజవకర్గ స్థాయి క్రికెట్ పోటీలు సోమవారం కొత్తూరులో ప్రారంభమయ్యాయి. తలండి దుర్గమ్మ-రాములు స్మారకార్థం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
నెన్నెల, జనవరి 1: నియోజవకర్గ స్థాయి క్రికెట్ పోటీలు సోమవారం కొత్తూరులో ప్రారంభమయ్యాయి. తలండి దుర్గమ్మ-రాములు స్మారకార్థం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మెట్పల్లి ఎంపీటీసీ దాగం రమేష్, యువ నాయకుడు చీర్ల కిషన్రెడ్డి టోర్నీని ప్రారంభించారు. నెన్నెల, భీమారం, కోటపల్లి, వేమనపల్లి, కన్నెపల్లి మండలాలకు చెందిన 40 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు నగదుతో పాటు ట్రోఫీలు అందజేస్తామన్నారు. డీసీసీ సభ్యుడు లావుడ్య రమేష్, సేవాలాల్ సేనా జిల్లా అధ్యక్షుడు గుగ్లోత్ మల్లేష్నాయక్, నాయకులు తలండి పోషమల్లు, కొర్తె రవికుమార్, జనార్దన్, బోయిని పోషం, శ్రీనివాస్, అశోక్, భీష్మయ్య, మధూకర్, మహేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.