Kumaram Bheem Asifabad: 5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
ABN , Publish Date - May 30 , 2024 | 10:54 PM
ఆసిఫాబాద్, మే 30: మండలంలోని బూర్గుడ గ్రామంలో గురువారం అయిదు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకు న్నట్లు సీఐ సతీష్, ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
- విలువ రూ.12.50 లక్షలు
- నిందితుడి అరెస్టు
ఆసిఫాబాద్, మే 30: మండలంలోని బూర్గుడ గ్రామంలో గురువారం అయిదు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకు న్నట్లు సీఐ సతీష్, ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ముందస్తు సమాచారం మేరకు బూర్గుడ సమీపంలో చెక్ చేస్తుండగా చింత లమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన పర్వతాల ప్రశాంత్ అనుమానా స్పదంగా సంచితో కని పించాడు. అతన్ని పట్టుకుని తనిఖీ చేయడంతో 50కిలోల నకిలీ పత్తివిత్తనాలు లభించాయి. అతని ఇంట్లో సోదాలు చేయగా మరో నాలుగన్నర క్వింటాళ్ల పత్తి విత్తనాలు లభించినట్లు తెలిపారు. కాగా ఈ విత్తనాలను లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామంలోని సొల్లు పెద్దయ్య అలియాస్ సురేష్ అనేవ్యక్తి దగ్గర కొనుగోలు చేసినట్లు ప్రశాంత్ తెలిపాడన్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులకు అధిక ధరలకు అమ్మాలన్న ఉద్దేశ్యంతో వీటిని తీసుకువచ్చినట్లు తెలిపాడ న్నారు. పట్టుబడ్డ విత్తనాల విలువ సుమారు రూ.12.50లక్షలు ఉంటుంద న్నారు. ఈ విత్తనాలను సొల్లు పెద్దయ్య గుంటూరు జిల్లా నుంచి తెస్తున్నట్లు పేర్కొ న్నాడన్నారు. నిందితుడిపై కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వారు తెలిపారు.