Kumaram Bheem Asifabad: బీజేపీ నాయకుల సంబరాలు
ABN , Publish Date - Jun 04 , 2024 | 11:14 PM
ఆసిఫాబాద్రూరల్, జూన్ 4: కేంద్రంలో బీజేపీ, ఆదిలాబాద్ ఎంపి స్థానాన్ని కైవసం చేసుకొవడంతో బీజేపీ శ్రేణులు మంగళవారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు.
ఆసిఫాబాద్రూరల్, జూన్ 4: కేంద్రంలో బీజేపీ, ఆదిలాబాద్ ఎంపి స్థానాన్ని కైవసం చేసుకొవడంతో బీజేపీ శ్రేణులు మంగళవారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. ఈ సంద ర్భంగా బీజేపీ నాయకులు అంబేద్కర్ చౌక్లో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకురాలు సిద్దంశెట్టి సుహసిని ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకొని మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఖాండ్రే విశాల్, నాయకులు గణేష్, జయరాజ్, సుధాకర్, వినోద్, ఆకాష్, రవి, సాగర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు/కౌటాల/దహెగాం/సిర్పూర్(టి)/సిర్పూర్(యు)/చింతలమానేపల్లి: సార్వ త్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా గోడం నగేష్ విజయం సాధించడంతో మంగళవారం మండలకేంద్రాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ను బీజేపీ కైవసం చేసుకోవడం అభినందనీయమని సిర్పూర్(టి)జడ్పీటీసీ నీరేటిరేఖ,బీజేపీ మండలా ధ్యక్షుడు ఎల్ములె శంకర్ అన్నారు.
బెజ్జూరులో బీజేపీనాయకులు బాలకృష్ణ, దిగంబర్, తిరుపతి, రాకేష్, కౌటాలలో మధు కర్, కవిరాజ్, తిరుపతి, చందు దహెగాంలో లక్ష్మినారాయణ, సురేష్గౌడ్, సురేష్, రోహిత్, రమేష్, ప్రదీప్, సిర్పూర్(యు) లో కుమ్ర భీంరావు, మండల అధ్యక్షుడు గోడం శంభు, అనిల్కుమార్, చింతలమానేపల్లిలో తిరు పతి గౌడ్, బాలాజీ, పోశన్న, సత్తన్న, పురుషోత్త మచారి తదితరులు పాల్గొన్నారు.