Kumaram Bheem Asifabad: విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి: డీఈవో
ABN , Publish Date - Feb 28 , 2024 | 10:37 PM
తిర్యాణి, ఫిబ్రవరి 28: విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పెంంచాలని డీఈవో అశోక్ అన్నారు. బుధవారం మండలం లోని గుడిపేట మండల పరిషత్ ప్రాథమికపాఠశాల, గంభీరావుపేట ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించారు.
తిర్యాణి, ఫిబ్రవరి 28: విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పెంంచాలని డీఈవో అశోక్ అన్నారు. బుధవారం మండలం లోని గుడిపేట మండల పరిషత్ ప్రాథమికపాఠశాల, గంభీరావుపేట ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్బంగా రూంటురీడ్ వారు అందించిన పుస్తకాలను, వర్క్బుక్ను వినియో గించుకుంటున్న విధానాన్ని, రీడిం గ్కార్నర్స్ను ఆయన పరిశీలించారు. జడ్పీపాఠ శాలలో నిర్వహించిన సైన్స్ ప్రదర్శణలను పరిశీలించి అభినందించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయడు అంజయ్య, రూం టూ రీడ్ జిల్లా ప్రతినిధి జెన్నిఫర్, మండల ప్రతినిధి శ్రీనివాసచారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.