Share News

Kumaram Bheem Asifabad: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

ABN , Publish Date - Jun 28 , 2024 | 10:48 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 28: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని గిరిజనసంక్షేమ ఉపసంచాకురాలు ఆర్‌ రమాదేవి అన్నారు.

Kumaram Bheem Asifabad:  విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 28: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని గిరిజనసంక్షేమ ఉపసంచాకురాలు ఆర్‌ రమాదేవి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత సంవత్సరం పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనలో సబ్జెక్టు టీచర్లు కీలకపాత్ర పోషించారని అభినందించారు. ఈ ఏడాది ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం పదో తర గతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. రానున్న పదవతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇంగ్లీష్‌మీడియంలో పరీక్ష రాయాల్సి ఉందని, అందుకు సబ్జెక్టు ఉపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్‌, కోర్సు డైరెక్టర్‌ కృష్ణారావు, డీఆర్‌పీ వామన్‌రావు, టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2024 | 10:48 PM