Kumaram Bheem Asifabad: సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలు చిరస్మరణీయం
ABN , Publish Date - Feb 26 , 2024 | 10:40 PM
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 26: బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహా రాజ్ సేవలు చిరస్మరణయమని కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రేమలాగార్డెన్లో జిల్లా గిరిజనసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వ హించిన సంతోష్ సేవాలాల్, మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలలో ఆసిఫా బాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి హాజర య్యారు.
- కలెక్టర్ హేమంత్ బోర్కడే
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 26: బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహా రాజ్ సేవలు చిరస్మరణయమని కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రేమలాగార్డెన్లో జిల్లా గిరిజనసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వ హించిన సంతోష్ సేవాలాల్, మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలలో ఆసిఫా బాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి హాజర య్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ సంత్సేవాలాల్ మహారాజ్ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బంజార జాతిని సన్మార్గంలో నడిపించేందుకు తన బోధ నల ద్వారా విశేషకృషి చేశారన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం అనేకఉద్యమాలు చేశారని, ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడిలు అరికట్టడం, క్షేత్రధర్మాన్ని రక్షించడం లాంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. సంత్ సేవా లాల్ ఆచరించిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, గోపాల్నాయక్, రాం బాబు, రవినాయక్, విశ్వప్రసాద్, ఆత్మారాం నాయక్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.