Share News

ABN: ఆంధ్రజ్యోతి’ బిజినెస్‌ ఎడిటర్‌ బాలాజీ కన్నుమూత

ABN , Publish Date - May 10 , 2024 | 05:54 AM

సీనియర్‌ పాత్రికేయుడు.. ‘ఆంధ్రజ్యోతి’ బిజినెస్‌ ఎడిటర్‌.. గార్లపాటి బాలాజీ (54) తీవ్ర అనారోగ్యంతో గురువారం ఉదయం కన్నుమూశారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన బాలాజీ ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తిచేసి 1997లో పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించారు.

ABN: ఆంధ్రజ్యోతి’ బిజినెస్‌ ఎడిటర్‌ బాలాజీ కన్నుమూత

27 ఏళ్లపాటు బిజినెస్‌ జర్నలి్‌స్టగా సేవలు

హైదరాబాద్‌ సిటీ, మే 9 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ పాత్రికేయుడు.. ‘ఆంధ్రజ్యోతి’ బిజినెస్‌ ఎడిటర్‌.. గార్లపాటి బాలాజీ (54) తీవ్ర అనారోగ్యంతో గురువారం ఉదయం కన్నుమూశారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన బాలాజీ ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తిచేసి 1997లో పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించారు. తొలుత ఈనాడు బిజినెస్‌ డెస్క్‌లో సబ్‌ ఎడిటర్‌గా చేరారు. అనంతరం ఆ సంస్థలోనే కొన్నేళ్లు రిపోర్టర్‌గా పనిచేశారు. 2018లో ‘ఆంధ్రజ్యోతి’లో చేరి.. బిజినెస్‌ ఎడిటర్‌గా సేవలందించారు. 27 ఏళ్లుగా బిజినెస్‌ జర్నలిజంలోనే ఉన్న ఆయన కెరీర్‌ మొత్తం హైదరాబాద్‌ కేంద్రంగానే కొనసాగింది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు.


అప్పట్నుంచీ.. హైదరాబాద్‌లోని తన ఇంటిలోనే చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో గుంటూరుకు తీసుకెళ్లి, అక్కడ ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బుధవారం రాత్రి నుంచి ఆయన పరిస్థితి విషమించిందని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని.. గురువారం ఉదయం కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు స్వగ్రామం చీరాలలో నిర్వహించనున్ననట్లు వెల్లడించారు. కాగా, బాలాజీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలిద్దరూ వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు.

Updated Date - May 10 , 2024 | 05:54 AM