Share News

TS News: భార్యను తీసుకెళ్లారన్న కోపంతో కత్తితో యువకుడు దాడి.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Jul 11 , 2024 | 07:00 AM

నర్సంపేటలోని చెన్నారావుపేట 16 చింతల్ తండాలో దారుణం చోటు చేసుకుంది. మేకల బన్ని అనే యువకుడు తన భార్య దీపిక కుటుంబంపై విచక్షణ రహితంగా కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడి ఘటనలో దీపిక కుటుంబ సభ్యులు బానోతు శ్రీనివాస్, సుగుణ అక్కడికక్కడే మృతి చెందారు.

TS News: భార్యను తీసుకెళ్లారన్న కోపంతో కత్తితో యువకుడు దాడి.. ఇద్దరి మృతి

వరంగల్ : నర్సంపేటలోని చెన్నారావుపేట 16 చింతల్ తండాలో దారుణం చోటు చేసుకుంది. మేకల బన్ని అనే యువకుడు తన భార్య దీపిక కుటుంబంపై విచక్షణ రహితంగా కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడి ఘటనలో దీపిక కుటుంబ సభ్యులు బానోతు శ్రీనివాస్, సుగుణ అక్కడికక్కడే మృతి చెందారు. బానోత్ మదన్, దీపికకు గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. దీపికను మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన బన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్ద మనుషుల పంచాయతీ తర్వాత దీపికను తల్లిదండ్రులు తీసుకెళ్లారు. దీంతో బన్ని ఉన్మాదంతో రెచ్చిపోయి కత్తితో దాడికి తెగబడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

CM Revanth Reddy: గరిష్ఠ పరిహారం!

Read More TS News and Telugu News

Updated Date - Jul 11 , 2024 | 07:01 AM