Share News

Hyderabad: జాతీయస్థాయిలో ఉత్తమ పాత్రికేయులకు ఏటా రామోజీ స్మారక అవార్డులు..

ABN , Publish Date - Jun 23 , 2024 | 04:35 AM

జాతీయస్థాయిలో ఉత్తమ పాత్రికేయులకు రామోజీ గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకుడు దివంగత రామోజీరావు పేరిట ఏటా స్మారక అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఏపీ టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.

Hyderabad: జాతీయస్థాయిలో ఉత్తమ పాత్రికేయులకు ఏటా రామోజీ స్మారక అవార్డులు..

  • టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

పంజాగుట్ట, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో ఉత్తమ పాత్రికేయులకు రామోజీ గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకుడు దివంగత రామోజీరావు పేరిట ఏటా స్మారక అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఏపీ టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిఖిల కలిశెట్టి విద్య, వైద్య, చారిటబుల్‌ ట్రస్టు తరఫున ఈ అవార్డులను అందజేస్తామన్నారు.


త్వరలోనే సీనియర్‌ పాత్రికేయులతో కమిటీ ఏర్పాటు చేసి, ఆంగ్ల, హిందీ భాషలతో పాటు దేశవ్యాప్తంగా ప్రాంతీయ భాషల్లో పనిచేస్తున్న ఉత్తమ పాత్రికేయులను గుర్తించి అవార్డులను అందజేస్తామని తెలిపారు. రామోజీ స్మారక అవార్డుకు ఎంపికైన వారికి రూ.20 వేల నగదుతో పాటు మెమెంటో, ప్రశంసాపత్రాన్ని అందజేస్తామన్నారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ నేత సిరిపురపు తేజేశ్వరరావు, సురేశ్‌ చౌదరి, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 04:35 AM