Share News

TG News: మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డికి సతీవియోగం

ABN , Publish Date - Sep 10 , 2024 | 07:07 AM

మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డికి సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి శ్వేత అనారోగ్య కారణాలతో మృతి చెందారు. హోమియోపతి వైద్యుడైన లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ తరుఫున జడ్చర్ల నియోజకర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

TG News: మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డికి సతీవియోగం

మహబూబ్ నగర్: మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డికి సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి శ్వేత అనారోగ్య కారణాలతో మృతి చెందారు. హోమియోపతి వైద్యుడైన లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ తరుఫున జడ్చర్ల నియోజకర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంధన శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత ఆరోగ్య శాఖను స్వీకరించారు.


మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే..డా. చర్లకోల లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత లక్ష్మారెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్వేత లక్ష్మారెడ్డి మరణ వార్త తీవ్రంగా బాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు

Updated Date - Sep 10 , 2024 | 09:04 AM