Share News

విద్యార్థినిపై స్నేహితుల అత్యాచారం

ABN , Publish Date - Oct 02 , 2024 | 06:12 AM

బీటెక్‌ చదువుతున్న ఇద్దరు యువకులు స్నేహం ముసుగులో ఓ ఫార్మాడీ విద్యార్థినిని లాడ్జీకి తీసుకెళ్లి బలవంతంగా బీర్లు తాగించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు.

విద్యార్థినిపై స్నేహితుల అత్యాచారం
Pharma D Student

ఓరుగల్లులో దారుణం

యువతిని లాడ్జీకి తీసుకెళ్లిన యువకులు

బీర్లు తాగించి అత్యాచారం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన


వరంగల్‌ చౌరస్తా, అక్టోబరు 1: బీటెక్‌ చదువుతున్న ఇద్దరు యువకులు స్నేహం ముసుగులో ఓ ఫార్మాడీ విద్యార్థినిని లాడ్జికి తీసుకెళ్లి బలవంతంగా బీర్లు తాగించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. వరంగల్‌లో సెప్టెంబరు 15న జరిగిన ఈ దారుణంపై బాధిత విద్యార్థిని తండ్రి మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికొచ్చింది. బాధితురాలి తండ్రి, పోలీసుల కథనం ప్రకారం..జయశంకర్‌ భూపాలపల్లికి చెందిన ఓ అమ్మాయి వరంగల్‌ శివారులోని ఓ కళాశాలలో ఫార్మాడీ చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది.


భూపాలపల్లికి చెందిన ఇద్దరు అబ్బాయిలు అదే కాలేజీలో బీటెక్‌ చదువుతూ స్థానికంగా ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. ఒకే ఊరి వారు కావడంతో ముగ్గురు స్నేహితులు అయ్యారు. సరదాగా బయటకు వెళ్లివద్దామని చెప్పి బీటెక్‌ విద్యార్థులిద్దరూ విద్యార్థినిని సెప్టెంబరు 15వ తేదీన కారులో తీసుకెళ్లి.. దారుణానికి ఒడిగట్టారు.


వరంగల్‌లో ఓ లాడ్జిలో రెండు గదులు తీసుకొని ఓ గదిని అమ్మాయికి కేటాయించారు. తమ గదిలో బీర్లు తాగిన ఆ యువకులు మద్యం మత్తులో యువతి గదిలోకి వెళ్లి ఆమెతో బలవంతంగా బీర్లు తాగించారు. మత్తులో ఉండగా అత్యాచారం చేశారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Oct 02 , 2024 | 08:41 AM