Share News

TG News: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రారంభం..

ABN , Publish Date - Jun 09 , 2024 | 09:38 AM

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు (Group-1 prelims exam) ఇవాళ (జూన్ 9న) ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 31జిల్లాల్లో 4లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

TG News: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రారంభం..

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు (Group-1 prelims exam) ఇవాళ (జూన్ 9న) ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 31జిల్లాల్లో 4లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9నుంచి 10గంటల్లోపు అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలి.


తెలంగాణ వ్యాప్తంగా అభ్యర్థుల కోసం 897పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు ముందే స్పష్టం చేశారు. పరీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయగా.. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతోపాటు నోడల్ ఆఫీసర్లను మహేందర్ రెడ్డి నియమించారు.

Updated Date - Jun 09 , 2024 | 09:38 AM